క్రేజీ కాంబో..ప్రశాంత్ నీల్-మహేశ్ బాబు..KGF2పై సూపర్ స్టార్ రియాక్షన్ ఇదే

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF2 ఫిల్మ్ ఈ నెల 14న విడుదలైంది. దేశవ్యాప్తంగా ఈ పిక్చర్ కు విశేష స్పందన లభిస్తోంది. బీ టౌన్ ప్రముఖులు ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు. రాకింగ్ స్టార్ యశ్ ‘రాఖీ భాయ్’ సృష్టించిన బీభత్సం చూసి వావ్ అంటున్నారు. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ మూడింటినీ ఒకే చోట సమపాళ్లలో జోడించి ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.

ప్రశాంత్ నీల్ కు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించారు.ఈ విషయం ప్రశాంత్ నీలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సినిమా చూసిన తర్వాత తనకు కాల్ చేసిన సెలబ్రిటీల్లో జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు ఉన్నారని తెలిపారు. అయితే, తొలుత కాల్ చేసింది మహేశ్ బాబు అని పేర్కొన్నారు. తాను ఇటీవల మహేశ్ బాబును కలిసానని కూడా చెప్పారు ప్రశాంత్. ఎక్కువ మందిని కలిసి వారితో రిలేషన్ షిప్ బిల్డ్ చేసుకోవడం తనకు ఆనందం కలిగిస్తుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రశాంత్ నీల్ -మహేశ్ బాబు కాంబినేషన్ కూడా వెండితెరపైన ఆవిష్కృతం కావాలని సినీ అభిమానులు కోరుతున్నారు. చూడాలి మరి.. భవిష్యత్తులో ఈ కాంబో ఫిక్స్ అవుతుందో లేదో..

 

Read more RELATED
Recommended to you

Latest news