డాన్సుల మల్లారెడ్డి.. మద్యం సీసాల మల్లారెడ్డిగా మారిపోయారు – మహేష్ గౌడ్

-

మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా మందు తాగుతూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ఇన్చార్జిగా ఉన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో కలిసి రోజంతా ప్రచారం చేసిన మల్లారెడ్డి.. సాయంత్రానికి చౌటుప్పల్ గ్రామ శివారులోని తన అనుచరులతో మందు పార్టీ చేసుకున్నారు.

తనతో వచ్చిన నేతలతో పాటు లోకల్ కేడర్ కు ఫుల్లుగా మందు పోశారు. ఫుల్ బాటిల్ ని పట్టుకొని గ్లాసులో మందు పోస్తున్న మల్లారెడ్డి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. డాన్సుల మల్లారెడ్డి.. మద్యం సీసాల మల్లారెడ్డిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. క్యాబినెట్ అంతా మద్యం బానిసలు.. పేకాట బానిసలు ఉన్నారని విమర్శించారు.

మునుగోడులో మద్యంతో కార్యకర్తలను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. విస్కీ తాగుతూ.. కార్యకర్తలకు పోస్తూ ఉన్న ఆయన మంత్రిగా కొనసాగడానికి అర్హుడని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి డబ్బును నమ్ముకుని, టిఆర్ఎస్ మద్యాన్ని నమ్ముకుని ఎన్నికలకు దిగిందని.. కాంగ్రెస్ మాత్రం ఓటర్లు, కార్యకర్తలను నమ్ముకొని ఎన్నికలకు వెళుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news