తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ స్కాం… సంచలన వ్యాఖ్యలు చేసిన మహేశ్వర్ రెడ్డి

-

బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన..తాజాగా ట్రాక్ మార్చి మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ యూ ట్యాక్స్ వసూళ్లకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు . ఈ ఇష్యూపై మంత్రి ఉత్తమ్, మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి మరోసారి ఉత్తమ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కలెక్షన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. మంత్రి ఉత్తమ్, సివిల్ సప్లైయ్స్ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇద్దరూ కలిసి వసూళ్లకు పాల్పడుతున్నారని ,తాను చేసిన ఈ ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో బహిరంగ చర్చకు నేను సిద్ధమని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news