ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చు.. సీబీఐ దాడుల మీద స్పందించిన మాలోత్ కవిత !

-

లంచం తీసుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత నివాసంలో ముగ్గురు వ్యక్తులను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాము టీఆర్ఎస్ ఎంపీ పీఏలం అంటూ ఒక చోట అక్రమ నివాసం విషయంలో హెల్ప్ చేస్తామని చెబుతూ లంచం తీసుకుంటున్న సమయంలో వారిని అరెస్ట్ చేశారు. అయితే తన పీఏలమంటూ మోసాలకు పాల్పడుతున్న వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత.

ఢిల్లీలో అసలు తనకు పీఏలే లేరని చెబుతూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో దుర్గేశ్ తన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని అందుకే దుర్గేష్‌కు తన నివాసంలోని స్టాఫ్ క్వార్టర్స్ ఇచ్చానని  కవిత చెప్పారు. దుర్గేష్ తప్పు చేసినట్లు తేలితే.. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని ఎంపీ తెలిపారు. తాను కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని హైదరాబాద్ వెళుతున్నట్టు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version