లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి

-

లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. పేట్ బషీరాబాద్ లో 11 యాప్ ల ద్వారా చంద్ర మోహన్ అనే వ్యక్తి రుణం తీసుకున్నాడు. అయితే లోన్ యాప్ నిర్వాహాకుల వేధింపులు తట్టుకోలేక చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. మొదట 6 వేలతో ప్రారంభం అయిన లోన్ లక్షల రూపాయలు చెల్లించే వరకు వెళ్ళిందని పేట్ బషీరాబాద్ సిఐ రమేష్ తెలిపారు.

vikarabad sarpanch hanged himself writes a note

కట్టలేని పరిస్థితుల్లో చంద్రమోహన్ భార్యను సైతం వేధింపులకు గురిచేశారని తేలింది. సైబర్ క్రైమ్ పోలీస్ ల సహకారం తో ..ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ వేధింపులపై చంద్రమోహన్ ఆన్లైన్ లో ఫిర్యాదు కూడా చేసాడు..రాచకొండ పోలీస్ లు మృతుడికి ధైర్యం చెప్పి, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. చంద్రమోహన్ ను వేధించిన వారిలో ..హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారా అన్నది ఆరా తీస్తున్నామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version