దారుణం : తల్లి తల నరికి, తలతో పరారైన కొడుకు

-

మనుషుల మధ్య మానవత్వం అనేదే లేకుండా పోతోంది. క్షణిక ఆవేశంలో ఏమి చేయడానికి అయినా మనిషి ఆలోచించడం లేదు. అలానే ఓ కొడుకు మందు తాగడానికి తల్లి డబ్బు ఇవ్వలేదని చెప్పి ఆమె తల నరికి ఆ తలతో పరారయిన ఘటన కలకలం రేపుతోంది. పేగుతెంచుకు పుట్టిన కొడుకే ఆ తల్లి పాలిట యముడయ్యాడు, మృత్యువుగా మారాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కత్తితో నరికి చంపాడు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సింగోటం గ్రామానికి చెందిన చంద్రమ్మ కొడుకు రాములు జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి మద్యం కోసం తల్లిని డబ్బులు కావాలని అడిగాడు. కొడుకు వ్యసనాలు గురించి తెలిసిన తల్లి తన దగ్గర డబ్బుల్లేవని చెప్పింది. స్వల్ప వాగ్వాదం జరగగా తల్లి తల నరికి, నరికిన తలతో పరారయ్యాడు కొడుకు.

Read more RELATED
Recommended to you

Latest news