దివ్య తేజస్వినిని నాగేంద్రనే చంపాడు.. ఫోరెన్సిక్ నివేదికలో కీలక అంశాలు !

-

విజయవాడ దివ్య తేజస్విని కేసు పోలీసులకి సవాల్ గా మారింది. గంట గంటకూ ఓ విషయం బయట పడడంతో ఈ కేసు మీద అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ముందు ప్రేమించడం లేదని నాగేంద్ర బాబు చంపేసినట్టు చెప్పారు. తరువాత ఇద్దరికీ పెళ్లి జరిగింది, ఆ తరువాత అమ్మాయి తల్లితండ్రులు కలిసి బ్రతకనివ్వరని, ఇద్దరం కలిసి ఆత్మహత్యాయత్నం చేశానని నిందితుడు మీడియాకి చెప్పాడు.

అంతే కాదు ఆమెను ఆమె కోసుకుందని, తనను తాను కోసుకున్నానని చెప్పాడు. అయితే దివ్య తేజస్విని హత్య కేసులో ఫోరెన్సిక్ నివేదిక మాత్రం ఆ మాటలు నిజం కాదని తేల్చింది. ఎందుకంటే దివ్యను నాగేంద్ర హత్య చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక చెబుతోంది. యువతి శరీరం మీద ఉన్న గాయాలు సొంతంగా చేసుకున్నవి కాదని రిపోర్ట్ లో పేర్కొంది ఫోరెన్సిక్ శాఖ. యువతి గాయాల మీద సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీస్ శాఖ దాని ఆధారంగా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news