ఫ్రెండ్స్ తో బెట్టేసి ‘రా’ తాగాడు.. ఇక ‘అంతే’ !

-

ఒక్కోసారి సరదాగా చేసే పనులే ప్రాణాల మీదకు తెస్తాయి. ఆ ఏముందిలే అని చేసే ఆ పనులు చివరికి ప్రాణాలు పోయేదాకా చేస్తాయి. అందుకే ఏ పని చేసే ముందు అయినా ఒకటికీ నాలుగు సార్లు అలోచించి చేయాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. అసలు విషయంలోకి వస్తే కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి వేసిన పందెం అయన ప్రాణాన్ని బలిగొంది. నీళ్లు కలపకుండా మద్యం తాగాలని బాన్సువాడలో ఇద్దరు మిత్రులు ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు.

అలా నీళ్లు కలపకుండా మద్యం తాగిన సోమేశ్వరం సాయిలు (40).. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగానే అతను మార్గం మధ్యలో మృతి చెందాడు. నీరు కలపని మద్యం ఫుల్ బాటిల్ తాగి తన భర్త మృతి చెందాడని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news