వరదలో కొట్టుకుపోయి.. 14 రోజుల తర్వాత ప్రత్యక్షం

-

వరదల్లో కొట్టుకుపోయి మరణించాడనుకున్న ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగివచ్చాడు. ఈనెల 12న వరదల్లో కొట్టుకుపోయిన సురేశ్​.. 14 రోజుల తర్వాత మళ్లీ మంగళవారం ఆ పట్టణ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరులో జరిగింది.

భారీ వర్షాలకు స్థానికంగా ఉండే ఓ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అతను కాలువ దాటేందుకు ప్రయత్నించగా వరదలో కొట్టుకుపోయాడు. ఎంత వెతికినా సురేశ్ ఆచూకీ దొరకలేదు. ఇక అతడు తమకు దక్కడనుకుని ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది.

కానీ 14 రోజుల తర్వాత మళ్లీ మంగళవారం పట్టణ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న అధికారులు అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. తమకు సమాచారం ఇవ్వకుండా రోడ్లపై తిరుగుతున్నందుకు సురేశ్​ను మందలించారు అధికారులు. మరోవైపు చనిపోయాడని అనుకున్న వ్యక్తి కనిపించేసరికి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version