మనం మూవీ రీరిలీజ్ .. నాగార్జున స్పెషల్ వీడియో

-

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ మూవీ ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది.ఈ మూవీలో అక్కినేని మూడు తరాల వారు అయిన నాగేశ్వరరావు ,నాగార్జున ,నాగ చైతన్య ,అఖిల్ కలిసి నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ కే కుమార్ రూపొందించారు.2014 మే 23 న రిలీజ్ అయిన ఈ మూవీ అద్భుత విజయం సాధించింది.అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమాగా ‘మనం’ మూవీ నిలిచిపోయింది.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత మరియు శ్రేయ కీలక పాత్రల్లో నటించారు.ఇదిలా ఉంటే ..ఈ మూవీ రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ వీడియో ను షేర్ చేసుకున్నారు.మనం సినిమా మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం అని నాగార్జున అన్నారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో నాన్న గారికి బాగోలేకపోయిన సెట్స్ లో మా అందరిని నవ్విస్తూ షూటింగ్ పూర్తి చేసారు.కానీ నాకు ఒక్కటే భాధ నాన్న గారికి ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూపించలేక పోయాను.ఆయన ఎక్కడున్నా కూడా ఈ మూవీ కి మీరు చూపించిన ఆదరణ చూసి ఎంతో సంతోషించి వుంటారు.ఈ సినిమాను మళ్ళీ మీ ముందుకు తీసుకు రావడం చాలా ఆనందంగా ఉందని నాగార్జున వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news