IPL 2024 : ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేశారు.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సిబి లో ఓపెనర్ డూప్లిసిస్ విఫలం చెందారు. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.ఇక మరో ఓపేనర్ విరాట్ కోహ్లీ (33 పరుగులు) చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్వెల్ డక్ ఔట్ తీవ్ర నిరాశ పరిచాడు. రజత్ పటీదార్ (34పరుగులు), లామ్రోర్ (32పరుగులు) చేసి పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేశ్ 3వికెట్లు, అశ్విన్ 2వికెట్లు, బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఒకవేళ ఈ మ్యాచ్లో ఏ జట్టు అయితే గెలిచిందో ఆ జట్టు ఈనెల 24న జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తో తలపడునుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు డైరెక్ట్ గా ఇంటికే.

Read more RELATED
Recommended to you

Latest news