‘వరుడు కావలెను‘ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ”వరుడు కావలెను”. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా… లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు మరియు సాంగ్స్ తో ఓ రేంజ్‌ లో రెస్పాన్స్‌ వచ్చింది. లుక్‌ పరంగా హీరో నాగశౌర్య మరియు హీరోయిన్‌ రీతూ వర్మ ఇద్దరూ కూడా మంచి మార్కులు కొట్టేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వరుడు కావలెను సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ”మనుసులోనే నిలిచిపోకే” అనే రొమాంటిక్‌ సాంగ్‌ ను విడుదల చేసింది వరుడు కావలెను చిత్ర బృందం. ఇక ఈ సాంగ్‌ లో రీతు వర్మ మరియు నాగ శౌర్య మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే… ఈ పాటకు మ్యూజిక్‌ మరింత క్రేజ్‌ ను తెచ్చింది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన… దిగు దిగు అనే పాట యూట్యూబ్‌ ను షేక్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news