నేడు హైదరాబాద్ కు కొత్త కాంగ్రెస్ ఇంఛార్జ్.. రెండు రోజులు ఇక్కడే !

-

దేశ వ్యాప్తంగా బల పడే దిశగా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాలకు కొత్త సెక్రెటరీలు ఎంపికయ్యారు. అదే విధంగా కొత్త ఇంచార్జీల నియామకం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్ ను నియమించారు. ప్రస్తుతం తమిళనాడు విరుధానగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాణికం ఠాగూర్.

ఆర్సీ కుంతియా స్థానంలో మాణికం ఠాకూర్ నియామకం జరిగింది. ఇక ఇంచార్జ్ గా నియమితులు అయ్యాక నేడు తొలిసారిగా తెలంగాణా రానున్నారు ఆయన. ఈ రోజు మద్రాస్ నుండి ఒంటి గంటకు హైదరాబాద్ చేరుకోనున్న ఆయన రెండు రోజులు హైదరాబాద్ లో మకాం వేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ కి రానున్న ఆయన 6 గంటలకు కోర్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక రేపు ఎల్లుండి కూడా ఠాకూర్ సిటీ లోనే ఉండే అవకాశం ఉంది. ఇక అయన సోమవారం జరిగే ర్యాలీలో కూడా పాల్గొననున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news