రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే కోర్టుకెక్కిస్తాడు: మాణిక్కం ఠాగూర్

-

సీఎం రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా విమర్శలు చేస్తుండడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి షాక్ ఇవ్వడానికి తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్ మాణిక్కం ఠాగూర్ రెడీ అయ్యారు. ఇదివరకు ఇలాంటి వాస్తవ విరుద్ధమైన కామెంట్లు చేసినందుకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి మధురై కోర్టులో హాజరైనట్లే కేటీఆర్ కి కూడా ఆ తరహా తిప్పలు తప్పవని అన్నారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను అందుకు మాణిక్యం ఠాగూర్ ఆధారంగా తీసుకున్నారు.

Chief Minister A. Revanth Reddy

రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో విమర్శలు చేస్తున్న సందర్భంలోనూ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కావని.. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటలో మేనేజ్ చేసుకుని మాణిక్యం ఠాగూర్ కి 50 కోట్లు ఇచ్చి మళ్లీ ఢిల్లీకి వెళ్లి మేనేజ్ చేసుకుని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలని ఎన్నుకోలేదని ఎన్నటికీ నువ్వు కేసీఆర్ కాలిగోటికి సరిపోవని కామెంట్ చేశారు. కేటీఆర్ పై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ఠాగూర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version