పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారు: మంత్రి కొట్టు సత్యనారాయణ

-

మంత్రి కొట్టు సత్యనారాయణ పలు కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని కొట్టు సత్యనారాయణ అన్నారు. అలానే పొత్తులో పవన్, చంద్రబాబు చివరి వరకు ఉండడం అనుమానమే అన్నారు. బాబు రెండు సీట్లు ప్రకటించారు. ఇద్దరు పొత్తులో ఉన్నా ఎవరి దారి వాళ్ళదే అని కొట్టు సత్యనారాయణ అన్నారు. విహంగ వీక్షణ అంటే ప్రజలను గాలికి వదిలేస్తారా అని అడిగారు. పొత్తులు చివరివరకు ఉంటాయో లేదు అనేది చూడాల్సిందే అన్నారు కొట్టు సత్యనారాయణ.

పద్దతి ప్రకారం జగన్ ముందుకు వెళ్తున్నారు అని చెప్పారు. మీ కుటుంబాలకు మేలు జరిగితే, నాకు ఓటు వేయమని అడుగుతున్నారు అని కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవారు దర్మపక్షం ఉన్నట్టు అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు నేను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా అని కొట్టు సత్యనారాయణ అన్నారు. అలానే పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version