జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-

రాయలసీమ జిల్లాల సిద్దం సభ ఈ నెల 18 న రాప్తాడులో జరుపుతామని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భారీగా పార్టీ క్యాడర్, నాయకులు ఈ కార్యక్రమం కు హాజరవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎన్నికలకు ఇది శంఖారావం అన్నారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు లో సభ విజయవంతంగా నిర్వహించామని ఆయన అన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకి సిఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని ఆయన అన్నారు.

టిడిపి పతనావస్థకు చేరింది ఇది ప్రారంభం మాత్రమే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నిలబెట్టారో.. సిఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారు అన్నారు. జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news