గట్టు మీదే ఆగిపోయిన నాయకులు రైతులకు ఏం చేయగలుగుతారు: పురంధేశ్వరి

-

పురంధేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పలు కామెంట్స్ చేసారు. రైతులు అసంఘటితంగా ఉన్నపుడు సహాయం చేయాలని ఆమె అన్నారు. ఏపీలో రైతులందరూ కలిసి సంఘటితం కావాలని ఆమె అన్నారు. రైతు కంటక పరిపాలన ఏపీలో చూస్తున్నాం అని పురంధేశ్వరి అన్నారు. ఏపీలో 98.3% రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నారని సర్వేలు చెపుతున్నాయి అని ఆమె అన్నారు.

కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్ధానంలో ఏపీ ఉందని ఆమె అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోయి నైరాస్యం పెరిగిపోతే రైతు పక్షపాత ప్రభుత్వం ఎలా అవుతుంది మీది అన్నారు. గట్టు మీదే ఆగిపోయిన నాయకులు రైతులకు ఏం చేయగలుగుతారని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news