ఏవోబీలో మావోల అలజడి..ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో యువ‌కుడి హత్య.

-

తెలుగురాష్ట్రాలో గత నెల రోజులు నుంచి మావోస్టులకు పోలీసులకు ఆధిత్యపోరు జరుగుంది..ఎవరికి వారు పైచేయి సాధించాలని ప్ర‌య‌త్నిస్తున్నారు..తెలుగురాష్ట్రాల డీజీపీలు మావోల కదలికపై ప్రత్యేక దృష్టి పెట్టారు..తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ – ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు అల‌జ‌డి సృష్టించారు. ఏవోబీలో పోలీసు ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో ఓ గిరిజ‌న యువ‌కుడిని మావోయిస్టులు హ‌త‌మార్చారు. మ‌రో ఇద్ద‌రిని తీవ్రంగా గాయ‌ప‌రిచి వ‌దిలిపెట్టారు. గిరిజ‌నుల స్వ‌స్థ‌లం ప‌న‌స‌పుట్టు పంచాయ‌తీ ప‌రిధిలోని కోజిరిగూడెం. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొన‌సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news