మరో మూడేళ్లలో మావోయిస్టు రహిత భారత్ : అమిత్ షా

-

మరో రెండు మూడేళ్లలో దేశంలో మావోయిస్టుల సమస్య తీరిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని కొంత ప్రాంతం మినహా దేశం మొత్తం నక్సలైట్ల ముప్పు నుంచి విముక్తి పొందిందని తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘దేశం నలుమూలల నుంచి మావోయిస్టులను అంతమొందించాం. ఒకప్పుడు పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు మావోయిస్టు కారిడార్ గురించి చెప్పేవారు. కానీ ఇప్పుడు దాని ఉనికి లేకుండా పోయింది. జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయి’ అని వ్యాఖ్యానించారు.

ఛత్తీస్ ఘడ్ లోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు ఇప్పటికీ కార్యకలాపాలు సాగిస్తున్నారని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున అక్కడ వారిని అంతమొందించలేకపోయారని అన్నారు. ఐదు నెలల క్రితం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఛత్తీస్గఢ్ ్ను మావోయిస్టుల నుంచి విముక్తి చేసేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఫలితంగా సుమారు 125 మంది మావోయిస్టులు మరణించగా.. 352 మందికి పైగా అరెస్టయ్యారని తెలిపారు. అంతేగాక 175 మంది లొంగిపోయారని వెల్లడించారు. రాబోయే రెండు మూడేళ్లలో ఈ సమస్య పూర్తిగా సమసి పోతుందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news