BJP లోకి మర్రి శశిధర్.. ముహుర్తం ఫిక్స్!

-

కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడబోతోంది. సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గతవారం రోజులుగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న ఆయన వాటిని ఖండిస్తూ వస్తున్నారు.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడితో కలిసి కేంద్ర హోం మంత్రితో బేటీ కావడంతో మర్రి శశిధర్ చేరిక లాంఛనం కానుంది. త్వరలోనే బిజెపి జాతి అధ్యక్షుడు నడ్డా సమక్షంలో హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో బిజెపిలో చేరుతారని చెబుతున్నారు. ఈ నెల 25 లేదా 26 వ తేదీన బీజేపీలోకి సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి వెళ్లే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news