టిక్‌టాక్ మోజులో ప‌డి భ‌ర్త‌ను వ‌దిలేసి భార్య మ‌రో యువ‌తితో జంప్‌..

-

టిక్ టాక్… సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే క్రేజీ యాప్. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పిచ్చపిచ్చిగా ఈ యాప్ ను వాడేస్తున్నారు. టిక్‌టాక్‌ వల్ల ఎందరో ఉద్యోగాలు ఊడగొట్టుకున్నారు.. మరెందరో ఆత్మహత్యలూ చేసుకున్నారు.. ఇవన్నీ ఓ ఎత్తయితే మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే తాజాగా టిక్‌టాక్ మోజులో పడ్డ భార్య.. తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా కిలిచినపేటకు చెందిన ఓ మహిళ చెల్లెలిని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేసింది. అతను బెంగళూరులోనే పెట్రోలు బంక్‌లో పనిచేస్తున్నాడు.

అదే బంకులో పనిచేస్తున్న ఓ యువతిని అతను తన భార్యకు పరిచయం చేశాడు భర్త. ఆ పరిచయం కాస్తా.. ఎక్కడికో పోయింది. టిక్‌ టాక్‌లో వీడియోల దాకా సాగింది. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత ప్రేమ వారిద్దరి మధ్య ఏర్పడింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. ఇంట్లో చెప్పుకుండా ఆ యువతికోసం అర్చన బెంగళూరు వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా అర్చన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివాహిత ఆచూకీ దొరిగిందని బెంగళూరులోనే ఉందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news