ప్రియుడి మోసం.. సూసైడ్ చేసుకుంటున్నా నా బిడ్డను ఆదుకోవాలంటూ పోలీసులకు ఫోన్..చివరికి..!

-

విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని లెనిన్ నగర్ లో ప్రియుడు మోసం చేశాడని ఓ వివాహిత తన కూతురు తో కలిసి ఆత్మహత్య యత్నం చేసింది. ఆత్మహత్యకు పాల్పడుతూ తన కుమార్తెను పోలీసులు ఆదుకోవాలని కోరుతూ అర్ధరాత్రి మహిళ దిశ యాప్ ద్వారా పోలీసులకు మెసేజ్ పెట్టింది. దాంతో పోలీసులు హుటాహుటిన లొకేషన్ కు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించారు.

బాలికను పోలీసులు చేరదీశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత మహిళ బ్యాంకు ఉద్యోగిగా గుర్తించారు. మహిళ దిశ యాప్ ద్వారా మెసేజ్ పెట్టడంతో పోలీసులు మహిళ తో పాటు బాలికను కాపాడగలిగారు. సమయానికి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోనట్లయితే మహిళ మరణించి ఉండేది.

Read more RELATED
Recommended to you

Latest news