తండ్రయిన టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్

-

భారత క్రికెట్ జట్టు ఆటగాడు మయాంక్ అగర్వాల్ భార్య ఆషిదా సూద్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మయాంక్ అగర్వాల్ ఇన్స్టాలో వెల్లడించారు. ప్రొఫెషనల్ లాయర్ అయిన ఆశితను 2018లో మయాంక్ అగర్వాల్ వివాహం చేసుకున్నారు.

అతని భార్య మగ బిడ్డకి జన్మనిచ్చిన సందర్భంగా మయాంక్ అగర్వాల్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. ” మా గుండెల నిండా ప్రేమతో అయాన్ష్ ను పరిచయం చేస్తున్నాం. ఇతను దేవుడిచ్చిన ఓ బహుమతి” అని పేర్కొన్నాడు. ఇక ఈ విషయం తెలిసిన విరాట్ కోహ్లీ, పలువురు క్రికెటర్లు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news