రాష్ట్రపతి పదవి పై మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు

-

బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకు దేశ ప్రధాని కావాలని ఉందని, రాష్ట్రపతి కావాలనే ఆకాంక్ష ఏమాత్రం లేదని చెప్పారు.సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన పై పుకార్లు పుట్టిస్తున్నారు అని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బిఎస్పి ఓట్లను బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.అందుకు ప్రతిఫలంగా మాయావతి రాష్ట్రపతి అవుతారేమో అంటూ అఖిలేష్ యాదవ్ కామెంట్స్ చేశారు.దీంతో తాజాగా అఖిలేష్ కు మాయావతి కౌంటర్ ఇచ్చారు.

అంబేద్కర్, కాన్షీరామ్ బాటలోనే నడవాలనుకుంటున్నట్లు మాయావతి స్పష్టం చేశారు.దళితులు, అణగారిన వర్గాలు ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.తాను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదని బెహెన్ జీ వెల్లడించారు.మాయావతి సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్ లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news