రేపు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత

-

కోల్ కతాలో ఓ డాక్టర్ పై లైంగిక దాడి జరిగిన ఘటన దాదాపు అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్ని ఎంపిక చేసినటువంటి సేవలను నిలిపి వేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ నిరసన ద్వారా అత్యవసర సేవలను మినాహాయిస్తున్నట్టు పేర్కొంది.

కోల్ కతాలో వైద్యురాలి పై జరిగిన లైంగిక దాడి ఘటనకు నిరసనగా ఈ నిర్నయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర, ఆరోగ్య మంత్రి జే.పీ.నడ్డాకు ఓ లేఖ రాసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. వైద్యులకు భద్రత కల్పించాలని కోరింది. ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యుడి పరిస్థితి మరేలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండి వైద్యులు తమ ప్రాణాలను కాపాడుకుంటే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news