కరోనా పై మెగా ఫ్యామిలీ ఇస్తున్న మెసేజ్ ఇదే…!

-

కరోనా వైరస్ పై ప్రభుత్వాలు, ప్రజలు చేసే యుద్దంలో సినీ రాజకీయ ప్రముఖులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ లో అయితే చిరంజీవి ఎక్కువగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాటలు పాడటమే కాకుండా తన వంతుగా ఆయన విరాళం ఇచ్చారు, మెగా హీరోలు అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు.

తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఫ్యామిలీలో చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసనా, చిరంజీవి కుమార్తె సుష్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరం తేజ్, అతని తమ్ముడు వైష్ణవ తేజ్, చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ ఇలా అందరూ ఒక సందేశాన్ని అందించారు తమ అభిమానులు, ప్రజల కోసం.

ఇంట్లో ఉంటాం, యుద్ధం చేస్తాం, క్రిమిని కాదు ప్రేమను పంచుతాం… కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం, భారతీయులం ఒక్కటై భారత్ ని గెలిపిస్తాం అంటూ చివర్లో స్టే హోం అని పెట్టారు. దీనిని చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక మెగా ఫ్యామిలీ జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ కి పూర్తి మద్దతు ఇస్తూ షూటింగ్ లకు దూరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version