మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్..ఫ్యాన్స్ ప్రశంసలు

-

సేవా కార్యక్రమాలతో ఎప్పుడు ముందంజలో ఉండే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు . ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్టు ప్రభు ఇటీవల మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నాయని,యాంజియో గ్రామ్ చేసి బైపాస్ చేయాలని డాక్టర్లు సూచించారు.ఈ విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవిని సంప్రదించగా.. ఆయన స్టార్ హాస్పటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి ప్రభుని అడ్మిట్ చేయించారట.

 

బైపాస్ చేయాల్సిన పని లేకుండా.. కేవలం స్టంట్స్ వేసి డాక్టర్స్ ప్రాబ్లెమ్ క్లియర్ చేసారట. హాస్పిటల్ బిల్ కూడా ప్రభుని కట్టనివ్వకుండా.. మెగాస్టార్ చిరంజీవి అన్నీ సెటిల్ చేశారట. ఇదే విషయాన్ని స్వయంగా జర్నలిస్ట్ ప్రభు అభిమానులతో పంచుకున్నారు.

 

ఈ విషయంలో చిరంజీవికి రుణపడి ఉంటాను అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ న్యూస్ తెలుసుకున్న మిగతా జర్నలిస్టులు, నెటిజన్స్, మెగాస్టార్ అభిమానులు చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news