ఆ రాష్ట్రంలో పీఎం మోదీ సభకు నో పర్మిషన్

-

ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ, సభకు మేఘాలయ సర్కార్ నో చెప్పింది. మోదీ ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలో పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర క్రీడా శాఖ ఆ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ నిర్ణయం రాజకీయ పరంగా తీసుకుంది కాదని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే స్పందించారు.

“పీఏ సంగ్మా స్టేడియంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం సరికాదు. స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే అక్కడ మైదానంలో నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఉంది. అందుకు ప్రధాని మోదీ సభకు అనుమతివ్వలేదు. ప్రత్యామ్నాయ వేదికగా అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియం పరిశీలిస్తున్నాం.– స్వప్నిల్ టెంబే, జిల్లా ఎన్నికల అధికారి

Read more RELATED
Recommended to you

Latest news