Breaking: మిలాద్ ఉన్ నబి యాత్ర వాయిదా!

-

ఈ నెల 28న గణేష్ నిమజ్జనం పోలీసులకు సవాలుగా మారింది. అదే రోజు మిలాద్ ఉన్ నబి ర్యాలీ ఉండడంతో.. రెండు యాత్రల నిర్వహణపై మతపెద్దలతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మిలాద్ ఉన్ నబి ర్యాలీ వాయిదా వేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దానికి మత పెద్దలు అంగీకరించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని పోలీసులు కోరారు.

Photos: Milad-un-Nabi procession in Hyderabad

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలు జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా.. రెండు మతాల పెద్దలతో 300 మంది సభ్యులతో ఓ పీస్ కమిటీ (శాంతి కమిటీ) ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పీస్ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. రెండు పండుగలు ఒకే రోజు రావటంతో.. మిలాద్-ఉన్-నబీ ర్యాలీ వాయిదా వేసేందుకు పీస్ కమిటీ సభ్యులు ఒప్పుకున్నారు. హిందూ భక్తులు విగ్రహాలు ప్రతిష్ఠించిన 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా.. గణేష్ విగ్రహ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news