ఏపీ రాజధాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి బొత్స..

-

రెండు రోజు చేరుకున్న అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రి బోత్స ఏపీ రాజ‌ధాని రైతుల‌కు గుడ్ న్యూస్ తెలిపారు. ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీలో టీడీపీ డిమాండ్ చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం నెలకొందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలన్నారు. ఇందుకు మంత్రి బొత్స సత్యానారాయణ జవాబు ఇచ్చారు. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి చెప్పారు.

రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే అన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మ్యాప్‌లో అమరావతిని గుర్తించకపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. రాజధానిని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నామని.. త్వరలోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని బొత్స స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news