మంత్రి ధర్మాన: ఒక్క పైసా లంచం తీసుకోలేదు… చంద్రబాబు తీసుకోలేదని చెప్పగలరా !

-

నిన్న జరిగిన వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తుంటే… తాజాగా వైస్సార్ ఆసరా చెక్కులు అందించిన ధర్మాన ఇప్పటి వరకు మా ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకే అందేలా చేశాము. అయితే ఎక్కడా కూడా ఈ పథకాల పంపిణీలో ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు అని దైర్యంగా చెప్పారు.. ఇదే విషయాన్ని నేను ఎక్కడైనా తొడగొట్టి చెప్పగలను అంటూ మీసం మెలేశాడు ధర్మాన ప్రసాదరావు.

కానీ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మీ నాయకులూ లంచాలు తీసుకోలేదని చంద్రబాబు చెప్పగలరా ? గతంలో ఊరికి నలుగురు బ్రోకర్లు లంచాలు తిని రాష్ట్ర ప్రజలను నాశనం చేశారు అంటూ రెచ్చిపోయారు. ఈ కామెంట్ ల మీద చంద్రబాబు కానీ, మరేతర టీడీపీ నాయకులూ కానీ స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version