చంద్రబాబుకు ఐటీ నోటీసులపై మంత్రి కారుమూరి ఫైర్

-

చంద్రబాబుకు ఐటీ నోటీసుల పై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు  ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి కబుర్లు చెబుతుంటాడు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చంద్రబాబుకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు. అయినా ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదు? అని ప్రశ్నించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికి మాలిన పనులు అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు జీవితం అంతా స్టే తెచ్చుకోవటమే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి స్వభావం బీజేపీ నేతలకు తెలుసు అన్నారు. నోటీసుల విషయంలో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన ఉసురు చంద్రబాబు వెంటాడుతూనే ఉందన్నారు మంత్రి కారుమూరి. అమరావతి ఒక స్కామ్..  ఈ పేరుతో చంద్రబాబు, అనుచరులు కొన్ని తరాల పాటు దర్జాగా బతికే కుట్ర చేశారరని పేర్కొన్నారు. పేద ప్రజలు అప్పు భారం మోసే విధంగా చంద్రబాబు ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news