పవన్ ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం : మంత్రి కారుమూరి

-

ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు కలిసివచ్చి జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గానే వస్తాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ముసలినక్క చంద్రబాబుకు గెలుపుపై నమ్మకంలేదు కాబట్టే ఇతర పార్టీలతో పొత్తులకోసం ఎదురుచూస్తున్నాడని అన్నారు. ఇప్పటికే సర్వేలన్ని తమ గెలుపునే సూచిస్తున్నాయని… టైమ్స్ నౌ సర్వేలో వైసిపికి మళ్లీ 24 ఎంపీ సీట్లు వస్తాయని తేలిందని మంత్రి నాగేశ్వరరావు గుర్తుచేసారు.

Karumuri Nageswara Rao: చంద్రబాబును సీఎం చేయాలన్నదే పవన్ అజెండా - NTV Telugu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే పంచలూడదీస్తా… తాటతీస్తా అంటున్నాడని, ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని మంత్రి కారుమూరి నాగేశ్వరరవు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మనస్థాయేంటి? మన బ్రతుకేంటి? అని ఆలోచించుకోవాలని హితవు పలికారు. సినిమాలను సినిమాలుగా, రాజకీయాలను రాజకీయాలుగా చూడాలన్నారు. అంతేకానీ, సినిమాను, రాజకీయాన్ని జోడించు చూడవద్దన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news