బండి సంజయ్‌కు కూడా పార్టీ నుంచి బహిష్కరించండి : కేటీఆర్‌

-

మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్చార్జి నవీన్ జిందాల్ లను బీజేపీ హైకమాండ్‌ పార్టీ నుండి బహిష్కరించింది. అంతేకాకుండా ఏ మతానికి సంబంధించిన వారిని గానీ, మతాన్ని గానీ అవమానించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొంది. అయితే తాజాగా దీనిపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

బీజేపీ నిజంగానే అన్ని మతాలను సమానంగా గౌరవించేట్టయితే తెలంగాణ బీజేపీ చీఫ్  బండి సంజయ్ ను ఎందుకు సస్పెండ్ చేయదు? అని ప్రశ్నించారు. మసీదులన్నీ తవ్వేయాలని, ఉర్దూను నిషేధించాలని కోరుతూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన అతడిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అంటూ నిలదీశారు. జేపీ నడ్డా గారూ… ఎందుకీ తేడాలు? ఏమైనా స్పష్టత ఇవ్వగలరా? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version