చంద్రబాబు రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తున్నారు – మంత్రి మెరుగ నాగార్జున

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగా నాగార్జున. అసెంబ్లీలో సీఎం జగన్ ను ఎదుర్కోలేక పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. బహిరంగ సభలతో చంద్రబాబు రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. నరసాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే వారిని అబద్ధాలేనని అన్నారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన అవినీతిపరుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థలో ప్రజా అవసరాలను తీర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news