కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ, రఘువీరా, గిడుగు మోస్తున్నారు – పెద్దిరెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కెవిపి, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని…ఆ నలుగురికి ఇంకెవరైనా తోడు ఉంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుందని చురకలు అంటించారు.కాంగ్రెస్ లో ఉన్నవారంతా వైసీపీలో కి వచ్చేశారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Minister Peddireddy Ramachandra Reddy fire on Congress party

చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతవరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామన్ననారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని… వైసిపి పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా చంద్రబాబే మూల కారణం అంటూ వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ ను అక్రమంగా జైలులో పెట్టడానికి, రాష్ట్రం విడిపోవడానికి కూడా చంద్రబాబే కారణమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version