సీఎం కేసీఆర్ ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్..

-

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ను సీఎం కేసీఆర్ సత్కరించి…జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 1 కేజీ బంగారం, పట్టు వస్త్రాలు అందించినందుకు మంత్రి పువ్వాడను సీఎం కేసీఆర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, కుమారుడు నయన్ రాజ్ పాల్గొన్నారు.మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి పువ్వాడ దర్శించుకున్నారు.

మంత్రి తన జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయం లోని విమాన గోపురానికి..ఖమ్మం ప్రజల, రాష్ట్ర ప్రభుత్వం తరపున1 కేజీ బంగారం, పట్టు వస్త్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో మంత్రి అజయ్ కుమార్ ఆలయ ఈవో గీతకు అందజేశారు.మొదట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చిన మంత్రి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news