మోదీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికే లోకేష్ ఢిల్లీ వెళ్ళాడు: మంత్రి రోజా

-

చంద్రబాబు నాయుడు సడెన్ గా అరెస్ట్ కావడంతో టీడీపీ ఒక్కసారిగా మూగబోయింది. ఇప్పుడు పార్టీ బాధ్యత అంతా ఎంతకాదన్న లోకేష్ మీదనే ఉంది.. కానీ లోకేష్ ఇప్పుడు తన తండ్రిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి ఢిల్లీ వెళ్లి తన ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ నారా లోకేష్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడో వివరించి చెప్పారు. ఈమె మాట్లాడుతూ… టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ మరియు అమిత్ షా ల కాళ్ళు పట్టుకోవడానికే వెళ్లడంతో కామెంట్ చేసింది. మొన్ననే నారా లోకేష్ రాష్ట్రపతిని కలిసి మా నాన్న తప్పు చేశాడు ఎలాగైనా కాపాడండి అంటూ కోరాడు అని రోజా కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు సొమ్మును అడ్డంగా దోచేసిన వారిని కాపాడండి అని ఢిల్లీ వీధుల్లో లోకేష్ తిరుగుతున్నారంటూ రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.

చంద్రబాబు అవినీతి చేశాడని మోదీ అమిత్ షా లకు సైతం తెలుసని అందుకే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని లోకేష్ కు తెలియచేసింది రోజా.

Read more RELATED
Recommended to you

Latest news