ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి రోజా కీలక ప్రకటన..!

-

ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి రోజా కీలక ప్రకటన చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాలపై ఎవరికి నచ్చినట్లు వారు వాఖ్యలు చేస్తూన్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా వున్నా….రెండోసారి విజయం సాధించేది జగనేనని వెల్లడించారు.

roja fire on ap opponents

ప్రజలు సంక్షేమానికి…అభివృద్దికి పట్టం కడుతున్నారని చెప్పారు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చినా….ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఓరిగింది ఏమి లేదని వెల్లడించారు.
చంద్రబాబు ఇష్టానుసారం వ్యవస్థలను మేనేజ్ చేస్తూన్నాడని ఆగ్రహించారు. కాగా…ఆరా మస్తాన్‌ సర్వే సంస్థ.. రోజా ఓడిపోతుందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version