తెలంగాణను 3 జోన్లుగా విభజిస్తున్నాం: సీఎం రేవంత్‌

-

తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ అని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ అని.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. మూడు ప్రాంతాల్లోనూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని పేర్కొన్నారు.

అంతకుముందు ఆయన జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది అన్న రేవంత్.. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆరు దశాబ్దాల కల సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version