చిరంజీవి విభజన హామీలపై ఎందుకు మౌనం వహించారు: మంత్రి సీదిరి అప్పల్రాజు

-

పవన్ కళ్యాణ్ చేసిన సినిమా బ్రో వివాదం ఇంకా సమసిపోలేదు, చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ రోజు చిరంజీవి పవన్ పై వరుసగా చేస్తున్న కామెంట్ లపై తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వం పైన కామెంట్ చేయడంతో ఇక వరుసగా వైసీపీ నేతలు చిరంజీవి పైన కామెట్ చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు చిరంజీవిని స్ట్రెయిట్ గా ఒక ప్రశ్న అడిగినారు. ఈయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ … చిరంజీవి మాటలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన వారి జాబితాలో చిరంజీవి పేరు కూడా ఉందని అప్పలరాజు మాట్లాడారు. రాష్ట్రము విడిపోయి ఇంతకాలం అవుతున్నా ఎందుకు చిరంజీవి ఈ విషయంపై మాట్లాడలేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు మంత్రి అప్పలరాజు.

ఎప్పుడో రాజకీయాలు వదిలేశారు కదా, మళ్ళీ ఎందుకు రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి సీదిరి చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యల పైన మెగాస్టార్ ఫామిలీ నుండి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news