సామాజిక దూరం పాటిస్తూ జిమ్ లు, స్టేడియంలు తెరవవచ్చు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

కరోనా వల్ల ఆర్థిక సంక్షోభంతో పాటు క్రీడారంగం కూడా తీవ్రంగా నష్టపోయిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లాక్​డౌన్ తర్వాత యోగా సెంటర్లు, జిమ్​లు ఆగస్టు 5 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో పలువురు క్రీడాకారులు సమావేశమయ్యారు. టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు సిక్కి రెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్​ రెడ్డి స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ శ్రీనివాస్ రాజు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయేష్ రంజన్, చాముండేశ్వరినాథ్ హాజరయ్యారు.

Srinivasa goud

రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీపై.. ప్రభుత్వం సబ్​ కమిటీను వేసిందని అన్నారు. క్రీడా పాలసీపై తమ సలహాలు, సూచనలు ఇవ్వడానికి సీనియర్ ప్లేయర్లు ముందుకు రావడం సంతోషకరమన్నారు. తక్కువ మందితోనే వ్యాయామశాలలు నడపాలని మంత్రి వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ ఆగస్టు 5 నుంచి స్టేడియాల్లో క్రీడలు ప్రాక్టీస్ చేయవచ్చని పేర్కొన్నారు. టోర్నమెంట్ల నిర్వహణకు మాత్రం అనుమతి లేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news