లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకుంటే ఇన్నిరోజులు కొనసాగించేవాడా : వెల్లంపల్లి

-

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించనుంది.. అయితే, లోకేష్‌పై మాటల యుద్ధానికి దిగారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. లోకేష్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. పాదయాత్ర చేసినా, పాకుడు యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా.. లోకేష్‌ మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేడు అంటూ జోస్యం చెప్పారు.

TDP trying to divert public attention: Andhra minister after Lord Rama idol  vandalised at Ramateertham temple - India Today

నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే ఇన్ని రోజులు యాత్రను కొనసాగించేవాడా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. అసలు ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తెలుసా? అని నిలదీశారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ను పూర్తి చేసింది వైసీపీయే అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ… లోకేశ్‌కు విజయవాడలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు, మంత్రిగా లోకేశ్ విజయవాడకు ఏం చేశారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news