సీఎం జగన్‌ పై విమర్శలు చేయడమే చంద్రబాబు డ్యూటీ – విడదల రజని

-

సీఎం జగన్‌ పై విమర్శలు చేయడమే చంద్రబాబు డ్యూటీ అయిందని విమర్శలు చేశారు ఏపీ మంత్రి విడదల రజని. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి లో SNCU, NICU లను ప్రారంభించారు మంత్రి విడదల రజని. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ..విజయవాడలో ఇప్పటికే 250 బెడ్లతో మేటర్నటీ ఆసుపత్రి అందుబాటులో ఉంది..ఇప్పుడు మరో నలభై బెడ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆరోగ్యశ్రీలో చేస్తున్నవి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని ఆగ్రహించారు. చంద్రబాబు కనీసం ఒక్క ప్రయత్నం కూడా ఆరోగ్యశ్రీ లో చేయలేదని ఫైర్‌ అయ్యారు. సీఎం జగన్ గురించి మాట్లాడటమే చంద్రబాబు కు పనైపోయిందని చురకలు అంటించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులపై ఫేజ్ ల వారీగా చెల్లింపులు చేస్తున్నామన్నారు విడదల రజినీ.

Read more RELATED
Recommended to you

Latest news