మహిళలకు గుడ్ న్యూస్..కుట్టు మిష‌న్లు పంపిణీ చేసిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని

-

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగేళ్ల కాలంలోనే ఏకంగా 2.25 ల‌క్ష‌ల కోట్ల విలువైన సంక్షేమాన్ని మ‌హిళ‌ల‌కు అందించింద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. చిల‌క‌లూరిపేట‌లోని చౌద‌ర‌య్య క‌ల్యాణ మండ‌పంలో తాజాగా వైఎస్సార్ ఆస‌రా మూడో విడ‌త నిధుల విడ‌ద‌ల కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం నిర్వ‌హించారు.

మ‌హిళ‌లు పెద్ద ఎత్తున స్వ‌చ్ఛందంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి వారి ఆనందోత్సాహాల‌ను వెలిబుచ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ఈ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు రూ.2.25 లక్ష‌ల కోట్ల విలువైన ల‌బ్ధి చేకూరిస్తే.. అందులో రూ.1.41 లక్ష‌ల‌ కోట్లు నేరుగా డీబీటీ ప‌ద్ధతిన మ‌హిళ‌ల ఖాతాల్లోకి జ‌మ అయింద‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఈ స్థాయిలో గ‌త ప్ర‌భుత్వాలు ఏవీ ల‌బ్ధి చేకూర్చ‌లేద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండ‌గా ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. అనంత‌రం మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ హెన్రీ క్రిస్టినా గారు, క‌లెక్ట‌ర్ లోతేటి శివ‌శంక‌ర్‌ గారు, పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే నంబూరు శంక‌ర‌రావు గారు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news