హైదరాబాద్ మెట్రో సమయాల్లో స్వల్ప మార్పులు !

-

హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులు గమనిక.మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రతి శుక్రవారం రాత్రి 11.45గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు నిర్వహించేలా ఇటీవల అధికారులు ట్రయల్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఇదివరకు తెలిపిన అధికారులు.. తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news