పాలు తాగుతున్న పోచమ్మ తల్లి.. ఎక్కడంటే?

-

హైదరాబాద్ మియాపూర్ లోని మదినగూడ పోచమ్మ గుడిలో వింత ఘటన చోటుచేసుకుంటోంది. భక్తులు ప్రసాదంగా సమర్పించిన పాలను ఆలయంలోని అమ్మవారి విగ్రహం గత మూడు రోజులుగా తాగుతోందని పూజారులు చెబుతున్నారు. చెంచాతో పట్టిస్తున్న పాలను విగ్రహం పీల్చుకుంటోందని తెలిపారు. అదరుదైన, అద్భుతమైన ఘట్టాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

అమ్మావారి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది.దీంతో భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుండి అమ్మవారికి భక్తులు పాలు సమర్పిస్తూనే ఉన్నారు.ఇది అమ్మవారి మహిమేనని వారు అంటుండగా.. శాస్త్రీయంగా ఏదైనా కారణం ఉందా అంటూ నెట్టింట్లా చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news