ప్రజల్లో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది :చామల కిరణ్ కుమార్ రెడ్డి

-

బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఢిల్లీ లాబీయిస్టు అంటూ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీలో సీనియర్ నేతలు ఉన్నా, ఢిల్లీలో లాబీయింగ్ చేసుకొని ఎల్పీ నేతగా హోదా తెచ్చుకున్నాడని ఆరోపించారు . అంతేకాకుండా శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.టాక్స్‌లపై దమ్ముంటే ప్రూవ్ చేయాలని,అర్ధరహిత ఆరోపణలు తగదన్నారు. అడ్దదిడ్డంగా మాట్లాడితే పార్టీ కార్యకర్తలు నిలదీసుడు ఖాయమని తెలిపారు.

మాజీ మంత్రి హరీష్రావుకు ప్రతిపక్ష హోదాలో హుందాగా వ్యవహరిస్తే బెటర్ అంటూ ఆయన సూచించారు. ఎమ్మెల్యే కాకున్నా హరీష్ రావును మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లోనే ఎన్నో హామీలను నెరవేర్చిందన్నారు. తాము చెప్పిన హామీలన్నీ సంపూర్ణంగా నెరవేర్చుతామన్నారు. కానీ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ చొరవ చూపుతుందని ఆయన ఫైర్ అయ్యారు. ఇది సమాజానికి మంచిది కాదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news