BREAKING : బాలిక మిస్సింగ్‌ విషాదాంతం.. చెరువులో మృతదేహం

-

హైదరాబాద్లో మరో విషాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జవహర్ నగర్ లో ఓ బాలిక మిస్ అయిన సంఘటన తెలిసిందే. అయితే ఈ బాలిక మిస్సింగ్ విషాదాంతంగా మారింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక అమృతదేహం లభ్యమయింది.

ఆ బాలిక మృతదేహాన్ని చెరువులో పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ బాలిక తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. బాలిక మృతితో గుండెలవిసేలా రోధిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక ఈ ఘటనపై సిసి కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news