వాలంటీర్లు ముమ్మాటికీ ప్రభుత్వ సైనికులే… : వైసీపీ ఎమ్మెల్యే

-

రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వలంటీర్ల గురించి మాట్లాడిన మాటలు పార్టీకి ఖచ్చితంగా వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేనకు రెండున్నర లక్షల ఓట్లు జనసేనకు పడవు.. తాజాగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మేము అంతా రాజకీయ సైనికులం అయితే.. ఈ ప్రభుత్వానికి వాలంటీర్లు నిజమైన సైనికులని స్పష్ష్టం చేశారు. ఈ రోజు రాష్ట్రంలో మా ప్రభుత్వానికి ఇంత మంచి స్పందన మరియు పేరు రావడానికి ముఖ్యకారణం ఈ వలంటీర్ల సైన్యమే అని గర్వంగా ద్వారంపూడి చెప్పారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిత్యం ప్రజలకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పధకాలను చేర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని వలంటీర్ల కష్టాన్ని హైలైట్ చేసి మాట్లాడారు ద్వారంపూడి.

ప్రజలకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఏమిటో ప్రజలకు తెలుసని.. ఈ రోజు వారిని ప్రశ్నిస్తున్న వారికి ఏమి తెలుసంటూ చంద్రబాబు పవన్ లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news